భారతదేశంలో, ఆధునిక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో యమునా నదికి సమీపంలో ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని మధుర అని పిలుస్తారు. మధుర చాలా పవిత్రమైన నగరం.. ఇది శ్రీకృష్ణుడి జన్మస్థలం. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం, మధుర కంసుడు అనే నిరంకుశ రాజు పాలనలో ఉంది. కంసుడు చాలా అత్యాశ కలిగిన రాజు , అతను తన తండ్రి ఉగ్రసేనను కూడా విడిచిపెట్టలేదు; కంసుడు తనను తాను మధుర రాజుగా ప్రకటించుకున్నాడు. ఉగ్రసేనడు మంచి పాలకుడు. కానీ, కంసుడు దీనికి వ్యతిరేకం. మధురలోని సామాన్యమైన ప్రజల పైన కంసుడి యొక్క దుబారా మరియు అన్యాయమైన పాలనను కొనసాగించడానికి ఇదే మంచి సమయం. వీటన్నిటికీ మించి, కంసుడు తన రాజ పదవితో యదు రాజవంశం పాలకులను చాలా ఇబ్బద్ధి పెట్టేవాడు. ఇది తరచూ యుద్ధాలకు దారితీసింది మరియు మధురలో ఉండే ప్రజలను మనశ్శాంతి లేకుండా చేసింది.
కానీ కొన్నిరోజుల్లోనే మధురలో సంతోషకరమైన వార్త వచ్చింది. యువరాణి దేవకి యదు వంశ రాజు వాసుదేవ్ ను వివాహం చేసుకుంది. . మధుర పౌరులు పెళ్లికి స్వాగతం పలికారు, ఎందుకంటే యదు వంశ రాజుల యొక్క రాకతో కంసుడు తరచూ చేసే యుద్ధాలు ఆగిపోతాయని అనుకున్నారు మధుర ప్రజలు..
త్వరలోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. మధుర పండుగ రూపాన్ని ధరించింది. అందరూ పండుగ ఉత్సాహంతో ఉన్నారు. మధుర యొక్క సామాన్యమైన ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. మధుర ప్రజలు కంసుడి పాలనలో విసిగి పోయిన కారణంగా… ఇప్పుడు ఉన్న సంతోషం చాలా గొప్ప విషయం.
దేవకీ వాసుదేవ్ యొక్క పెళ్లి తర్వాత.. కంసుడికి ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది. రాక్షస రాజు అయినా కంసా..! దేవకీ వాసుదేవ్ ల పెళ్లిని జరిపించి మీ యొక్క మరణాన్ని మీరే ఆహ్వానించారు. దేవకీ వాసుదేవ్ పుట్టబోయే ఎనిమిదవ సంతానం నిన్ను సంహరిస్తాడు అని.
ఇది విన్న కంసుడు భయంతో ” దేవకిని చంపేస్తే ఇంకా పిల్లలు ఎవరు పుట్టారు కదా ” అనుకొని చెల్లెలి దేవకిని చంపడానికి వెళ్ళాడు అది చూసిన వాసుదేవ్ ,నా భార్యని చంపకండి. కావాలంటే మాకు పుట్టిన ప్రతీ సంతానాన్ని నీకు నేను స్వయంగా తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు.
వాసుదేవ్ మాటలని నమ్మిన కంసుడు దేవకి మరియు వాసుదేవ్ లకు నా రాజభవనంలోని చెరసాలలో ఖైదీలుగా ఉండండి అని చెప్తాడు. కంసుడి యొక్క మాటని వినడం తప్ప దేవకీ వాసుదేవ్ ఇంకా ఏమి చెప్పలేకపోయారు. పరిస్థితి తన నియంత్రణలో ఉందనే ఆలోచనతో కంసుడు సంతృప్తి చెందాడు.
కంసుడు, దేవకి మరియు ఆమె భర్త కింగ్ వాసుదేవ్ను రాజా భవనంలోని నేలమాళిగల్లో ఉన్న చెరసాలలో బంధించి నిరంతరం నిఘా ఉంచారు. దేవకి చెరసాలలో బిడ్డకు జన్మనిచ్చిన ప్రతిసారీ, కంసుడు ఆ పిల్లవాడిని చంపించేసాడు. ఇలా దేవకి జన్మించిన ఏడుగురు పిల్లలను చంపాడు. కంసుడు తన సోదరి దేవకీ ఎంత ప్రాధేయపడినా కూడా కనికరించలేదు.
దేవకి ఎనిమిదోసారి గర్భవతి అయ్యింది.. కంసుడు తన శత్రువు యొక్క పుట్టుక కోసం వేచి చూస్తూ చూస్తూ.. నిద్రలోకి జారుకున్నాడు. దేవకీ మరియు వాసుదేవ్ పుట్టబోయే ఎనిమిదవ సంతానాన్ని కూడా ఎలాగూ కంసుడు చంపేస్తాడని ఆలోచిస్తూ చాలా బాధపడ్డారు. . వాసుదేవ్, దేవకిని ఓదార్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.
దేవకీ ” దేవుడా..! నా ఈ బిడ్డనైనా రక్షించండి. అంటూ విలపించ సాగింది.
ఆ రోజు అర్ధరాత్రి చల్ల గాలులు బాగా వీచాయి. అంధకారం ఎప్పుడు లేనంతగా ఉంది. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. కొన్ని నిమిషాలలో ప్రకాశవంతమైన వెలుగు వచ్చి ఎనిమిదవ సంతానంగా దేవకీ మరియు వాసుదేవ్ లకి అర్ధరాత్రి ఆ చెరసాలలో కృష్ణుడు జన్మించాడు.
శ్రీ కృష్ణుడు జన్మించిన వెంటనే, జైలు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. దేవకి బిడ్డ యొక్క ప్రకాశవంతమైన కాంతిని చూసి మూర్ఛపోయింది మరియు వాసుదేవ్ మైమరచిపోయాడు. ఆకాశం నుండి ఒక స్వరం వాసుదేవ్ కి వినబడింది.
“ఈ పిల్లవాడిని మీ స్నేహితుడైన రాజు పాలించే గోకుల రాజ్యానికి యమునా నది మీదుగా తీసుకెళ్లు. అతని భార్య యశోద ఇప్పుడే ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. మీ కుమారుడిని వారికిచ్చి వారి కుమార్తెను ఇక్కడికి తీసుకురా మరియు మీ కుమారుడి బిడ్డ పుట్టుక గురించి ఎవరికి తెలియకముందే చెరశాల కి తిరిగి వచ్చేయ్ అని వినబడింది ఆ స్వరం నుండి.
ఇక వాసుదేవ్ ఏమి ఆలోచించకుండా ఆ స్వరం నుండి వచ్చిన మాట ప్రకారం అపుడే పుట్టిన కుమారుడిని తీసుకొని యమునానది తీరం గుండా గోకులానికి చేరుకున్నాడు. తన స్నేహితుడిని కలిసి తన కుమారుడిని వారికిచ్చి వారి కుమార్తెని తీస్కొని వచ్చి దేవకీ పక్కన పడుకోబెట్టాడు.
వెంటనే ఆ బిడ్డ గట్టిగ ఏడవడం ప్రారంభించింది. ఆ శబ్దానికి అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న సైనికులందరు మేల్కొన్నారు. దేవకీ బిడ్డకి జన్మనిచ్చిందని ఆ వార్తని కంసుడికి చెప్పారు.
ఎంతో ఆతురతతో వేచి చూస్తున్న సమయం వచ్చినందుకు కంసుడు సంతోషపడ్డాడు. వెంటనే దేవకీ దగ్గరికి వెళ్ళాడు. అపుడే స్పృహలోకి వచ్చిన దేవకీ తనకి కుమార్తె పుట్టిందని తెలుసుకొని అన్న అయినా కంసుడిని ప్రాతిధేయపడింది. నాకు పుట్టిన ఆడపిల్ల మీకు ఏ మాత్రము హాని కలిగించదు దయచేసి మీ మేనకోడలిని బ్రతకనివ్వండి అని వేడుకుంది.
కంసుడు దేవకీ మాటలను పట్టించుకోలేదు. వెంటనే ఆ బిడ్డని తీస్కొని గోడ వైపుగా విసిరేసాడు. కానీ ఆ బిడ్డ గాలిలో పైకి ఎగిరింది వెంటకే ఒక పెద్ద కాంతి వచ్చి ఆ బిడ్డ ఒక దేవతల మారిపోయింది.
వెంటనే కంసుని వైపు జాలిగా చూస్తూ “కంసా నిన్ను చంపేవాడు పుట్టాడు. అతను ఇప్పుడు బాగా మరియు సురక్షితమైన ప్రదేశంలో సజీవంగా ఉన్నాడు. మరియు ఒక రోజు, అతను నిన్ను వెతుక్కుంటూ వచ్చి చంపేస్తాడు! నువ్వు ఎంత ప్రయత్నించినా అతన్ని అడ్డుకోలేవు! ” అని చెప్పింది.
తీవ్ర భయాందోళనకు గురైన కంసుడు జరిగిన సంఘటన వల్ల చాలా అవమాన పడ్డాడు. వెంటనే దేవకీ మరియు వాసుదేవ్ లని జైలు నుండి విడిపించేసాడు.
వాసుదేవ్ ఆ రాత్రి ఏమి జరిగిందో తన భార్యకు వివరించాడు. దేవకి, తన కొడుకు నుండి విడిపోయినందుకు విచారంగా ఉన్నప్పటికీ, శిశువుకు సంతోషంగా ఉన్నాడు అని ఆనందపడింది.. తన కొడుకు తన దుష్ట మామ కంసుడి బారిలో పడకూడదని వారిద్దరూ భగవంతుడిని ప్రార్థించారు.
నందా రాజు ఇంటిలో అందరూ పడ్డాడు మగ బిడ్డ పుట్టినందుకు చాలా` సంతోషంగా ఉన్నారు. నందా ఆ బిడ్డకు కృష్ణ అని పేరు పెట్టారు. గోకులంలోని ప్రతి ఒక్కరూ ఆనందంతో నృత్యం చేసి, పసికందును చూడటానికి మరియు బహుమతులు ఇవ్వడానికి నందా ఇంటికి తరలివచ్చారు.
కానీ ఆ పిల్లవాడు సాధారణ బిడ్డలా లేడని అందరు అనుకున్నారు. వర్షాకాలంలో నీటితో నిండిన మేఘం కనిపించే విధంగా అతని చర్మం ముదురు – నీలం రంగును కలిగి ఉంటుంది. అతని కళ్ళు ఉల్లాసంగా మెరుస్తున్నాయి. అతను ఎప్పుడూ అల్లరి చేస్తూ మరియు ఎల్లప్పుడూ అందరిని నవ్విస్తూ ఉంటాడు.
యశోద చాలా గర్వపడింది. . ” కొడుకు!” లిటిల్ కృష్ణ వంక ప్రేమగా చూస్తూ వీడు చేసే అల్లరితో అందరి మనసుల్ని ఆకర్షిస్తున్నాడు. అని అనుకుంది.
ఈ విధంగా సృష్టికర్త అయిన దేవుడు శ్రీకృష్ణుడు జన్మించాడు. కంసుడి వంటి భయంకరమైన నిరంకుశుల నుండి అందరినీ రక్షించడానికి అతను జన్మించాడు. తన బాల్యంలో, అతను ఎక్కడికి వెళ్ళినా, అందరి పురుషులు మరియు మహిళల హృదయాలను గెలుచుకున్నాడు. మరియు తన సోదరుడు బలరాంతో కలిసి, అతను తిరిగి మధుర వెళ్లి కంసుడిని చంపాడు.